ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నతాధికారులు ఖరారు చేశారు. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్, జూలై 24న ఈసెట్, 25న ఐసెట్, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న ఎడ్సెట్, ఆగస్టు 6న లాసెట్, ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్ష తేదీలు ఖరారు