టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఎపిని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తనకు క్లాస్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, తాను మోడీ మాత్రమే ఆ రూమ్లో ఉన్నామని, వీళ్లు రూమ్లో సోఫా కింద ఉండి విన్నారా? అని ప్రశ్నించారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
