ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 54 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 మంది శాంపిల్స్ను పరీక్షించగా 54 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టుగా తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు
