ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. ముందుగా కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరికి సీఎం పూజలు నిర్వహించారు. ఆపై గోదావరి నదికి చీర, సారె సమర్పించారు. అనంతరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్