భారత్లో కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్డౌన్ అమవలుతున్నప్పటికి పాజిటీవ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 157 మంది మరణించారు. సోమవారం నాటికి దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 96, 169కి చేరింది. వీరిలో 3029 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా.. 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఒకే రోజు ఈ స్థాయిలో పాజిటీవ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
