దేశ వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్-30 వరకు లాక్ డౌన్ పొడిగించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది. కట్టడి ప్రాంతాల్లో లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా.. అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్లు, స్విమ్మింగ్పూల్స్పై ఫేజ్-3లో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది
