దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నియంత్రణ మాత్రం సాధ్యం కావడంలేదు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 97 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67,152కి, మృతుల సంఖ్య 2206కి చేరింది. అలాగే ఇప్పటివరకు 20,917 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
