పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్
పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్

పలాస ఘటనపై సీఎం జగన్ సీరియస్

పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించిన ఆయన… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టలర్ నివాస్‌ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ టి. నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్. రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.