డ్రోన్ కెమెరా కేసులో బెయిల్ కోసం ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగి పీఎస్లో నమోదైన కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసు వాదన కోసం ఏఐసీసీ నుంచి సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో లాయర్ల బృందం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం రేవంత్ కేసులను వాదించనుంది.

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి