పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రంలో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు రాశారు. ఎస్.రాధాకష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి పాట శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా జవనరి 12న విడుదల కానుంది.
