లాక్డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రధాని మంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ పొడిగించాలని ప్రధానికి విన్నవించారు. దీంతో.. ముఖ్యమంత్రుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు భారత ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ఏప్రిల్ 30వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.

లాక్డౌన్ పొడిగింపునకే కేంద్రం మొగ్గు..?