శుక్రవారం సాయంత్రం అఖిలపక్షసమావేశం

శుక్రవారం సాయంత్రం అఖిలపక్షసమావేశం

భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాని చర్చించారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన దాడిలో 20మంది భారత సైనికులు మరణించగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.