ప్రస్థానం
సినిమాతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవకట్టా. అదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు దేవకట్టా సిద్ధమయ్యాడు. మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు.
ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు (గురువారం) జరిగింది. పవర్స్టార్ పవన్కల్యాణ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై సాయితేజ్పై క్లాప్ కొట్టారు. ఈ సినిమా దేవకట్టా శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కబోతోందట. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్