సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు.