కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సీసీసీ-మనకోసం’కు రూ.50 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వరకే ప్రభాస్ కరోనా వైరస్ నివారణా చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి మూడు కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే.

సీసీసీ కి ప్రభాస్ భారీ విరాళం