భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ) అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ తృటిలో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రణ్తంబోర్ తిరిగి వస్తుండగా రాజస్తాన్లోని సూర్వల్ వద్ద లాల్సాట్-కోట హైవేపై కారు బోల్తా కొట్టిందని అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం నుండి తేరుకున్న ఆజారుద్దీన్..కుటుంబ సభ్యులతో కలిసి మరో కారులో వెళ్లారు. 1992 నుండి 1999 వరకూ భారత క్రికెట్ జట్టు తరుపున మూడు సార్లు ఐసిసి వరల్డ్ కప్ పోటీలకు కెప్టెన్గా వ్యవహరించారు. భారత్ తరుపున 99 టెస్ట్ మ్యాచ్లు ఆడారు.