నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడ్డ అబ్దుల్ సలాం కుటుంబం పై సిఎం జగన్ స్పందించారు. సిఎం మాట్లాడుతూ.. ఈ ఘటన బాధ కలిగించిందన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం విషయం సోషల్ మీడియా లో వచ్చిన వెంటనే న్యాయబద్ధంగా ఏం చేయాలనే దిశగా ఆలోచించామన్నారు. ఎక్కడా తనా..మనా బేధం చూపలేదని స్పష్టం చేశారు. మైనార్టీల గురించి గొప్పలు చెప్పుకునే టిడిపి నేత, లాయర్ రామచంద్రరావు పోలీసుల తరుపున బెయిల్ పిటిషన్ ను వేశారని తెలిపారు. ఎవరికైనా న్యాయం ఒకటేనని చర్యలు తీసుకున్నామన్నారు. బాధ్యులయిన పోలీసులను అరెస్టు చేశామని సిఎం జగన్ పేర్కొన్నారు.