సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్.జగన్ వర్చువల్గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలు, 26 జిల్లాలుగా పున: వ్యవస్థీకరణయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటును సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ కూడా, ప్రతి ఒక్కరికీ సిఎం జగన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.