ఆధార్ కార్డ్ ఉన్న వారికి షాక్..

ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ ఇవ్వాల్సిందే.

ఇలా ఆధార్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఆధార్ కార్డుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆధార్ కార్డులో కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండే అవకాశముంది. ఇలా తప్పులు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడొచ్చు. అందువల్ల కార్డులో తప్పులు లేకుండా చూసుకోవాలి.

యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ వివరాలను మార్చుకునేందుకు చెల్లించే చార్జీలను రూ.50 పెంచింది. బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్‌కు ఇది వర్తిస్తుంది. అంటే ఇకపై ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలంటే రూ.100 చెల్లించాలి. యూఐడీఏఐ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఆధార్‌లో ఒకటి కన్నా ఎక్కువ వివరాలను సరిచేసుకోవాలంటే రూ.100 చెల్లించాల్సిందే. ఇకపోతే పేరు, మొబైల్ నెంబర్, వయసు వంటి వివరాల మార్పునకు రూ.50 చెల్లించాలి.