త్వరలో రాజమౌళి, మహేష్ కాంబోలో రాబోయే చిత్రంపై రచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహేష్ సినిమా కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కథను తీసుకోవాలి అనే ఆలోచనఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తి చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్పై దృష్టి సారిస్తారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న’ట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ 2023 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.