ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి, మహేష్‌ కాంబో..!

త్వరలో రాజమౌళి, మహేష్‌ కాంబోలో రాబోయే చిత్రంపై రచయిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహేష్‌ సినిమా కోసం ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ కథను తీసుకోవాలి అనే ఆలోచనఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్‌ అడ్వెంచర్‌ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న’ట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2023 ప్రారంభంలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది.