ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు-వెల్లంపల్లి శ్రీనివాస్
ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు-వెల్లంపల్లి శ్రీనివాస్

ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు-వెల్లంపల్లి శ్రీనివాస్

ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామని చెప్పారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్‌లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపలి​ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు