ఉగాది వేడుకల్లోజగన్.. పంచాగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు

జగన్ క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అర్చకులను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ సమర్ధవంతంగా అమలు చేస్తారన్నారు. సంక్షేమం దిశగా పాలన ఉంటుందని.. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని.. కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు.