ఉప ఎన్నికకు సిద్దం.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గన్నవరం శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు జరిపితే తాను సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన వంశీ ఇటీవల వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దపడాలంటూ టిడిపి నుంచి సవాళ్లు వస్తున్న నేపథ్యంలో వంశీ స్పందించాడు. తను ఉప ఎన్నికలకు సిద్దమని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికే చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం కరోనా ఉన్న కారణంగ ఉప ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని అన్నారు. ఒక వేళ అలాంటి పరిస్థితే ఉంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. అమరావతి రాజధానికి తన నియోజకవర్గంలోనూ రైతులు భూమిలిచ్చి నష్టపోయారని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణపై తన నియోజకవర్గ ఎన్నికలు రెఫరెండంగా ఉంటాయంటే తనకు సమ్మతమే అన్నారు. లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించే పరిస్థితులు లేవని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అనివల్లభనేని వంశీ అన్నారు.