ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) పలు పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని డిప్యూటీ సర్వేయరు, ఎపి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లోని టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సిర్, పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల కోసం కమిషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గురువారం విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్ జూరష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.