ఏపీ లో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీ లో గత 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్‌ 19 పరీక్షల్లో 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 1332 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం 1332 కేసులకుగాను 287 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఎలాంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1014. గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా, 73 మంది కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్థారించబడ్డారు.