పంజాబ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్లో విజృంభించాడు. దుబారు ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో రాహుల్ సెంచరీ బాదాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు చేసిన రాహుల్ మ్యాచ్ ముగిసే సరికి 132 (69) పరుగులు చేశాడు. ఐపిల్-13 సీజన్లోనే తొలి సెంచరీ చేసిన క్రికెటర్గా రాహుల్ పేరు నమోదు చేసుకున్నాడు. మొదటి నుంచీ రాహుల్ దాటిగానే ఆడుతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలిసి పవర్ ప్లే ఓవర్లు నిలకడగా ఆడాడు. 14 ఓవర్లు దాటిన తరువాత రాహుల్ విజృంభించాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరా అని చూడకుండా అందిన బాళ్లను అందినట్లు బౌండరీలను తరలించాడు. అంతకు ముందు వాషింగ్టన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని సింగిల్ తీసి 50 (36) స్కోరును అందుకున్నాడు. డేల్ సెయిన్ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్స్లు, రెండు ఫోర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అంతకు ముందు 16వ ఓవర్లోనూ భారీ సిక్స్ కొట్టాడు. శివమ్ దూబే వేసిన చివరి ఓవర్లో రాహుల్ రెండు సిక్స్లు, ఒక ఫోర్ బాధడంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 132 (69) పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 20 ఓవర్లకు పంజాబ్ 206/3 పరుగులు చేసింది.