ఒక్కరోజులో 13 శాతం పెరిగిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,466 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఒక్కరోజులో 13 శాతం మేర  పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 460 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,61,849కిచేరింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,39,683కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం 264 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. పాజిటివిటీ రేటు 98.25 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 11,961మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,37,87,047కి చేరింది.