శక్తిమంతమైన ఒక రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న కంగనకు పలువురి మద్దతు లభిస్తోంది. తాజాగా కంగనాకు హీరో విశాల్ తన మద్దతును ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన నోరు మూయించాలనుకున్న మీరు…మిగిలిన కోట్ల గొంతుకలను మూయించగలరా? అని థాకరేని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో కంగనకు మద్దతు తెలుపుతూ విశాల్ లేఖ రాశారు. ‘డియర్ కంగన… నీ గట్స్కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు’ అని విశాల్ అన్నాడు. అంతేకాదు ‘వాక్ స్వాతంత్య్రపు హక్కు (ఆర్టికల్ 19)’ అని పేర్కొన్నాడు.