కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్ TNR మృతి

ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి (TNR) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్‏లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుముశారు. ఆయన మరణంతో జర్నలిస్ట్, సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‏కు గురైంది.