కరోనాలోనూ ఓటు వేయడం అభినందనీయం: మోడీ

బీహార్‌లో ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఫోర్బెస్‌గంజ్‌ హవాయి అడ్డా ప్రచార ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. బీహార్‌ ప్రజలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓట్లు వేయడాన్ని అభినందించారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం అభినందనీయమన్నారు. ఎన్నికల ప్రక్రియను ఇంత సమర్థవంతంగా కొనసాగించినందుకు ఎన్నికల సిబ్బందికి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. బీహార్‌ ప్రజల ఆశలను తెలుసుకున్నామని, ఎన్నికల్లో గెలుపొందాక వీటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు. అనంతరం కోసిలో జరగనున్న మరో ప్రచార ర్యాలీలోనూ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని పాల్గోనున్నారు.