కరోనా పంజా.. 200లకు చేరువలో మరణాలు

దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 28,903 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజటివ్‌ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. కొత్తగా 17,741 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,45,284 మంది డిశ్చార్జి అయ్యారు.
మరోవైపు కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. 24 గంట్లో 188 మంది మృత్యువాతపడగా.. మొత్తం మరణాల సంఖ్య 1,59,044కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 2,34,406 ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.