దేశంలో కోవిడ్ విశృంఖలంగా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా చేరింది. రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ లాక్డౌన్ వైపు మొగ్గు చూపారు. ఈ నెల 8 నుండి 16 వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉండనుందని గురువారం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 9 గంటల నుండి ఉదయంం 5 గంటల వరకు కర్ఫ్యూ నడుస్తోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో సుమారు 42 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.