కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న ఏపీ గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు మంగళవారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వైద్య సిబ్బంది వారికి కోవిడ్‌ టీకా వేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ ఎం. ధ్యానచంద్ర పరిశీలించారు.