గుంకలాంలో ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించిన జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం విజయనగరంలో పర్యటించారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం.. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ఇంతమందికి మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని హర్షాన్ని వ్యక్తపరిచారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి చాలా చేశానని అన్నారు