చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు
చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హైదరాబాద్‌ ఉప్పల్‌లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా టీవీ ఛానల్స్‌లో చాలా ప్రబలంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హెరిటేజ్‌ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్‌గా ఉండే ప్రాంతాలలో వైరస్ వచ్చినప్పుడు అది ఇంకా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉంది.కాబట్టి తక్షణమే బయటకు వచ్చి దీనిలో వాస్తవాలేంటి.. అవాస్తవాలేంటి.. ఏం జరిగింది.. ఎంతమందికి వచ్చింది.. ఎంతమందిని క్వారంటైన్ చేశారనే దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయనాయకుడిగా మీపై ఉంది. హెరిటేజ్ ఆయన స్వంతసంస్థ అయినప్పటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడుకు గుర్తుచేస్తున్నాను.