టిడిపి వెంటిలేటర్ దశలో ఉందని, పర్మిషన్లు లేకుండా ఎయిర్పోర్టులో కూర్చుని డ్రామాలాడితే విలువ ఉండదని మంత్రి బత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విమర్శించారు. నాడు జగన్ కూడా ప్రత్యేకహోదా కోసం వైజాగ్కు వెళ్లినపుడు ఇలాగే చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలపై సోమవారం స్థానిక కెటిఆర్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషనర్కు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని, అన్ని శాఖలు ఆయన పరిధిలోనే నడుస్తున్నాయని వివరించారు. వాలంటీర్లపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బంది కల్గించేలా ఉందని, దాని విషయంలోనే అభ్యంతరం చెబుతున్నామని తెలిపారు.