జగన్‌ అధ్యక్షతన కీలక సమావేశం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రులు, పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరవనున్నారు. ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.