టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం జనగామలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు కాలనీలను మంత్రి సందర్శించారు. అనంతరం జనగామలోని ధర్మకంచ బస్తీలో ప్రజలతో కేటీఆర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.