టీడీపీ కి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్
టీడీపీ కి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్

టీడీపీ కి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్

స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ భారీ షాక్‌ తగిలింది. టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అధిష్ఠానం వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కార్యకర్తలకు, అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. టీడీపీ అధిష్టాన వైఖరి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. టీడీపీ నేతల చౌకబారు విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు.