డిజాస్టర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గన్నారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈ వాహనాలను విపత్తునిర్వహణ సంబంధిత చర్యల్లో సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు. వాహనాలను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.