డిసెంబరులో సూర్య యాక్షన్‌ థ్రిల్లర్‌

పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎదర్కుమ్‌ తునిందవన్‌’ సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్టు మేకర్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్‌ మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. డి.ఇమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేయబోతున్నారు. సూర్య.. ఇటీవల ‘జైభీమ్‌’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరితో కన్నీళ్ళు పెట్టించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.