డ్రగ్స్ కేసులో ఇంతవరకు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే వినిపించాయి.. కానీ బడా హీరోలుగా చెలామణీ అవుతున్న కొందరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వారు డ్రగ్స్ వాడుతున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం.
రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో గతంలో డిలీట్ అయిన డేటాను ఎన్సిబి తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా బాలీవుడ్లోని ముగ్గురు ప్రముఖ హీరోలు డ్రగ్స్ వ్యవహారంలో భాగస్వాములేనని ఎన్సిబి గుర్తించింది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్సిబి విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్సిబి నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.