తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన జగన్‌

అధునాతన వసతులతో రూపొందించిన వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాలను సిఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఈ వాహనాలను తహశీల్దార్లు, విఆర్‌ఒల పర్యవేక్షణలో ఆయా జిల్లాలకు పంపించనున్నారు.