తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ -సీఎం కేసీఆర్

తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహాయించి మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లుగా పరిగణించనున్నామని తెలిపారు.‘కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. బతుకును బంద్ పెట్టుకుని జీవించలేము.హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్ లో సరి ,బేసి విధానంలో దుకాణాలు తెరవాలి. హైదరాబాద్ సిటీ బస్సులు నడవవు. తెలంగాణ జిల్లాల్లో బస్సులు నడుస్తాయి. ఆటోలు, కార్లు నడుస్తాయి. సెలూన్లు తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం సెలూన్లు తెరవొద్దు.ఆర్టీసీ కోవిడ్ నిబంధనల మేరకు నడుస్తాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మళ్లీ పూర్తిస్థాయిలో లాక్‌ డౌన్‌ విధించే అవకాశం ఉంటుంది.బార్లు, క్లబ్బులు, జిమ్ములు, పార్కులు బంద్ ఉంటాయి. మెట్రో రైలు నడవదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. షాపు ఓనర్స్ శానిటైజర్లను తప్పనిసరి ఉంచాలి. 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధులను, పిల్లలను బయటకు రానివ్వొద్దు. తక్కువ సమయంలో బయట పడతాం. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష’ అని కేసీఆర్‌ అన్నారు