తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.