తెలుగు హీరోలను పొగుడుతూ మోడీ తెలుగు ట్వీట్
తెలుగు హీరోలను పొగుడుతూ మోడీ తెలుగు ట్వీట్

తెలుగు హీరోలను పొగుడుతూ మోడీ తెలుగు ట్వీట్

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్ డౌన్ అయ్యింది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్లో క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తూ సినీ తార‌లు ప‌లు కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం కావాలంటూ సూచ‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు క‌థానాయ‌కులు చిరంజీవి, నాగార్జున‌, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్ క‌లిసి కోటి సంగీత సార‌థ్యంలో రూపొందించిన ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తూ క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్‌ల‌ను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.