దేశంలో కొత్తగా 11,666 కరోనా కేసులు

 దేశంలో గడిచిన 24 గంటల్లో 11,666 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. కరోనా నుంచి కోలుకొని 14,301 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో 123 మంది మరణించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,01,193కు పెరిగింది. ఇప్పటి వరకు 1,03,73,606 మంది కోలుకోగా.. 1,53,847 మంది మతి చెందారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.