దేశంలో కొత్తగా 49 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా 49,881 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 517 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,27,527కి చేరుకుంది. నిన్న దేశవ్యాప్తంగా 56,480 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకున్నారని, ఇంకా 6,03,687 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 90.99 శాతం మంది కోలుకున్నారు.