దేశంలో మృత్యు ఘంటికలు.. 4 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇవి రికార్డు స్థాయి మరణాలు. కేసులు కూడా 4 లక్షలను దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 4,01,078 కరోనా కేసులు పుట్టుకొచ్చాయి. వారంలో నాలుగు లక్షల కేసులు దాటడం ఇది నాల్గవ సారి. 4,187 మంది మరణించారు. ఈ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తంగా 2,18,92,676 కేసులవ్వగా…2,38,270 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు భారత్‌లో 1,79,30,960 మంది కరోనా నుండి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.