ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నా హీరో నాని

నేచురల్‌స్టార్‌ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘శ్యామ్‌ సింగరారు’చిత్రంలో ఇలా కనిపించనున్నారు. 1960 నాటి ఒక ప్రాత్ర, ప్రస్తుత జనరేషన్‌కు లింక్‌గా మరోపాత్రలో నటించనున్నారు. కోల్‌కత్తా, హైదరాబాద్‌లలో పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.ఈ ఏడాది ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శ్యామ్‌సింగరారు’ షూటింగ్‌లో పాల్గనబోతున్నాడు. మరోవైపు డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ వెయిటింగ్‌లో ఉన్నాడు. ఇవి కాకుండా మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నారు నాని.