నేచురల్స్టార్ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరారు’చిత్రంలో ఇలా కనిపించనున్నారు. 1960 నాటి ఒక ప్రాత్ర, ప్రస్తుత జనరేషన్కు లింక్గా మరోపాత్రలో నటించనున్నారు. కోల్కత్తా, హైదరాబాద్లలో పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు.ఈ ఏడాది ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శ్యామ్సింగరారు’ షూటింగ్లో పాల్గనబోతున్నాడు. మరోవైపు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ వెయిటింగ్లో ఉన్నాడు. ఇవి కాకుండా మరో మూడు సినిమాలను లైన్లో పెట్టే పనిలో ఉన్నారు నాని.